ఇదే సమయంలో ఆర్బీఐ ద్వారా ఇదే సంవత్సరంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రూపాయికి మరింత బలం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బ్లాక్ చెయిన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్బీఐ తేనున్న డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ విధానం ఊపందుకుంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ రూపీ ప్రవేశంతో ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్తేజం వస్తుందని భావిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. డిజిట్ కరెన్సీ రూపకల్పనకు సంబంధించి ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గతంలో నోట్ల రద్దు సమయంలో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల కారణంగా సామాన్య ప్రజలు సైతం క్రమంగా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ దిశగా దేశం మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ఇదే సమయంలో ఆర్బీఐ ద్వారా ఇదే సంవత్సరంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రూపాయికి మరింత బలం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బ్లాక్ చెయిన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్బీఐ తేనున్న డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ విధానం ఊపందుకుంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ రూపీ ప్రవేశంతో ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్తేజం వస్తుందని భావిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. డిజిట్ కరెన్సీ రూపకల్పనకు సంబంధించి ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గతంలో నోట్ల రద్దు సమయంలో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల కారణంగా సామాన్య ప్రజలు సైతం క్రమంగా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ దిశగా దేశం మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.