మాల్దీవుల్లో ఎయిర్ ఇండియాకి ఘనమైన స్వాగతం..మాల్దీవులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రపంచంలో వుండే అత్యంత అందమైన ప్రదేశాల్లో ఇవి ఒకటి. ఇదొక మంచి టూరింగ్ స్పాట్ అనే చెప్పాలి. అనేక దేశాల నుంచి చాలా మంది ధనవంతులు ఈ దీవుల్లో రిలాక్స్ అవ్వడానికి వస్తుంటారు. ఇక మన సెలబ్రిటీలు కూడా సేద తీరడానికి ఈ దీవులకు వచ్చి బాగా రిలాక్స్ అవుతుంటారు. ఇక మాల్దీవుల్లో ల్యాండ్ అయిన ఎయిరిండియా AI-267కు అత్యద్భుతమైన స్వాగతం  అనేది దక్కింది. 1976 నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు నడిపిస్తున్న ఎయిరిండియాకు వాటర్ కెనాన్ సెల్యూట్ సమర్పించడం జరిగింది.ఇక మాల్దీవుల్లోని మాలె ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విమానానికి గగనానికి తాకేంత ఎత్తులో చెరో వైపు వాటర్ గన్ లు అనేవి బాగా సంధించి పరస్పరం ఢీకొంటూ పడే నీటి తుంపరలలో నుంచి విమానం ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది.


ఇంటర్ నేషనల్ ఎయిర్ లైన్ సర్వీసులను 23నెలల తర్వాత ఏప్రిల్ నెలలో మరలా పునరుద్ధరించనుంది ఎయిరిండియా కంపెనీ.ఇక దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని చెప్పాలి. ఇక దేశీయ సర్వీసులను నడుపుతుండటంతో విదేశీ సర్వీసులకు ఎంతో సమయం పట్టదని కూడా భావిస్తున్నారు.కరోనా వైరస్ మహమ్మారికి ముందు 2వేల 800 విమానాలను నడిపిన డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం ఫిబ్రవరి 20 వ తేదీ న మొత్తం 2వేల 58 సర్వీసులను నడిపడం అనేది జరిగింది.అంటే దాదాపు 80శాతం అనేది పూర్తి చేసినట్లే.ఇక 2021 డిసెంబర్ 15 వ తేదీ నుంచి ఇంటర్ నేషనల్ ఏరోప్లేన్స్ నడపాలని ప్లాన్ చేసింది ఈ విమానయాన శాఖ. కరోనా వైరస్ యొక్క ఆందోళన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అనేవి చాలా ఎక్కువగా పెరగడంతో  ఈ నిర్ణయాన్ని మార్చుకుని ఫిబ్రవరి 28 వ తేదీ వరకూ నిషేదాన్ని పొడిగించడం అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: