ఇక సమయపాలన విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ.. హైదరాబాద్ ప్రజా రవాణా రూపు రేఖల్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పే హైదరాబాద్ మెట్రో తాజాగా మరోక తీపికబురును చెప్పింది.ఇప్పటి దాకా వెళుతున్న వేగానికి మించిన వేగంతో వెళ్లేందుకు వీలుగా తాజాగా అనుమతులు లభించాయి.ఇక హైదరాబాద్ మెట్రో రైళ్లను మరింత వేగంగా నడిపేందుకు వీలుగా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ అనుమతులు ఇచ్చినట్లుగా ఎల్ అండ్ టీ మెట్రో సీఎండీ కమ్ సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.దీంతో.. హైదరాబాద్ మెట్రో రైళ్లు ఇప్పుడు మరింత వేగంగా దూసుకెళ్లేందుకు అవకాశం ఉంది. ఇప్పటి దాకా గంటకు 80కిలోమీటర్ల వేగంగా రైళ్లను నడిపేందుకు అనుమతులు ఉన్నాయి. తాజాగా వచ్చిన అనుమతులతో ఇకపై గంటకు 90 కిలోమీటర్ల వేగంగా మెట్రో రైల్ ని నడిపేందుకు వీలుంది. కాకుంటే.. స్టేషన్ కు స్టేషన్ కు మధ్య గ్యాప్ మినిమమ్ నిమిషం.. మాక్సిమం ఒకటిన్నర నిమిషమే ఉన్న నేపథ్యంలో అనుమతులు వచ్చినంత వేగంగా రైళ్లను నడిపే అవకాశాలు తక్కువ. ఒకవేళ.. నాన్ స్టాప్ గా రైలును నడిపితే మాత్రం మాక్సిమం స్పీడ్ తో నడపటం ద్వారా.. సమయం చాలా వరకు ఆదా అయ్యే వీలుంది.



ప్రస్తుతం నడుపుతున్న రైళ్లను చూసినప్పుడు..తాజాగా పెరిగే వేగంతో ఆదా అయ్యే టైం కాస్తంత తక్కువనే చెప్పాలి. ఇక మెట్రో రైళ్ల వేగాన్ని మార్చి 28, 29 తేదీల్లో కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు పరిశీలించారు. తాజాగా అనుమతులు వచ్చిన నేపథ్యంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారి ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య ప్రయాణ సమయం ఆరు నిమిషాల పాటు తగ్గనుంది.అలాగే అదే సమయంలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య నాలుగు నిమిషాల మేర తగ్గనుంది. జేబీఎస్ ఇంకా ఎంజీబీఎస్ మధ్య మాత్రం కేవలం ఒకటిన్నర నిమిషం మాత్రమే ప్రయాణ సమయం ఆదా కానుంది. ప్రతి స్టేషన్ లో రైలు ఆగటం ఇంకా వెళ్లటం కారణంగా ప్రయాణ సమయం కూడా ఎక్కువ అవుతోంది. ప్రతి స్టేషన్ లో కూడా 30 సెకన్ల మేర రైలును నిలుపుతున్నారు. ఇక నాన్ స్టాప్ సర్వీసులు వస్తే మాత్రం.. పెరిగిన వేగం చాలానే సమయాన్ని ఆదా చేసే ఛాన్స్ ఉంది. అయితే.. హైదరాబాద్ మెట్రో ఎలాంటి నాన్ స్టాప్ సర్వీసుల్ని నడపని సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: