తెలంగాణలోని బీరు ప్రియులకు ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. త్వరలో బీరు ధరలు కూడా పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న బీరు ధరలపై ఒక్కో దానిపై 10-20 పెరిగే ఛాన్స్ ఉంది.ఇక ఈ మేరకు ప్రతిపాదనలు సిధ్దమైనట్లు సమాచారం తెలుస్తుంది.అలాగే బీరు ధరలను పెంచాలని కొంత కాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు అనేవి కొరుతున్న నేపధ్యంలో బీరు ధరలు పెంపుపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఇటీవల కసరత్తుని కూడా జరిపారు. ఈ కసరత్తు తరువాత ఒక్కో బీరు ధరపై రూ. 10-20 పెంచాలని వారు నిర్ణయించారు. ఈమేరకు త్వరలోనే జీవో కూడా జారీ కానుంది. ప్రస్తుతం లైట్ బీరు ధర వచ్చేసి రూ.140 ఉండగా దాన్ని రూ.150 కి, స్ట్రాంగ్ బీర్ ధర రూ.150 ఉండగా దానిని రూ. 170 చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.మరోవైపు ఈ సంవత్సరం వేసవి దెబ్బకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుందుకున్నాయి. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం తెలుస్తోంది.



గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా పడిపోయిన బీర్ల అమ్మకాలు ఈ సంవత్సరం బాగా పెరిగాయి. రాష్ట్రంలో పెరిగిన ఎండలు, ఉక్కపోత ఇంకా వేడి గాలుల నుంచి కూల్ కూల్ గా సేద తీరేందుకు ప్రజలు బీర్లను ఖాళీ చేస్తున్నారు.గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ ఏడాది వేసవిలో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయని ఎక్సైజ్ శాఖ లెక్కల్లో సమాచారం తెలుస్తోంది. బీర్ల సేల్స్ లో ఈ సంవత్సరం రంగారెడ్డి జిల్లా మొదటి స్దానంలో నిలిచింది. ఆ జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీరు అమ్మకం జరిగింది. 1.15 కోట్ల లీటర్ల బీరు అమ్మకంతో వరంగల్‌ రెండో స్థానంలో ఉంది.ఇది నిజంగా తెలంగాణ మందు బాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక మరి ఆ చేదు వార్తని వాళ్ళు ఎలా జీర్ణించుకుంటారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: