తెలంగాణ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్దీ రోజులు గా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి 600కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో 658 కోవిడ్ కేసులను గుర్తించారు. ఇదే సమయంలో 628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ నగరం లో 316 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4511 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారంతో (441 కరోనా కేసులు) పోలిస్తే సోమవారానికి 99 కేసులు పెరగ్గా.. సోమవారం (540 కేసులు)తో పోలిస్తే మంగళవారానికి వందకుపైగా కరోనా కేసులు పెరగడం గమనార్హం.


హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లో నే కేసులు ఎక్కువగా నమోదు కాగా.. ప్రస్తుతం నగరాని కి దూరంగా ఉన్న జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగా 30 కేసులు నమోదు కాగా.. పెద్దపల్లి జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 21, కరీంనగర్‌లో 18, సంగారెడ్డి జిల్లాలో 16 చొప్పున కేసులను గుర్తించారు. భూపాలపల్లి, నిర్మల్, నాగర్‌ కర్నూల్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మంగళవారం కోవిడ్ కేసులు నమోదు కావడం విశేశం..
 

ఇకపోతే.. ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. జూలై 16న ఈ జిల్లాలో 27 కేసులు నమోదు కాగా.. మరుసటి రోజు 15 కేసులే నమోదయ్యాయి. సోమవారం 22 కేసులు నమోదు కాగా.. మంగళవారం ఆ సంఖ్య 30 దాటింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోనూ కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 30,552 కరోనా టెస్టులు చేశారు. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్ పరీక్షల సంఖ్య 3,60,95,926కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8,10,976 మంది కరోనా బారిన పడగా.. 98.94 శాతం మంది కోలుకున్నారు. 4511 మంది కోవిడ్‌కు బలయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: