లక్ష్మీదేవి కటాక్షం ఉండాలే కానీ ఏం చేయకపోయినా కూడా అదృష్టం తలుపు తడుతుంది అని చెబుతూ ఉంటారు. కొంతమంది మాకు బాగా డబ్బు రావాలని ఇక సంపన్నులుగా బ్రతకాలని దీనికోసం కటాక్షం కావాలంటు లక్ష్మీదేవికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేయకపోయినా లక్ష్మీదేవి కటాక్షం దక్కుతూ చివరికి ధనవంతులు గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అదృష్టం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోకుండా ఉండలేరు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 కేరళలోని కోజికోడ్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాపారాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో దిక్కుతోచని  స్థితిలో ఇక తన సొంత ఇంటిని అమ్మేందుకు సిద్ధమయ్యాడు. మరికొన్ని గంటల్లో ఇక ఈ ప్రక్రియ పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో అతనికి ఒక జాక్పాట్ తగిలింది. అతను తీసుకున్న లాటరీ చివరికి కోటి రూపాయలు గెలిచింది. ఇంకేముంది అతని సమస్యలు మొత్తం తీరిపోయాయి అని చెప్పాలి.


 కోజికోడ్ కు చెందిన  మహమ్మద్ బవా వృత్తి రిత్యా పెయింటర్. అతడికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఎనిమిది నెలల క్రితం రెండు వేల అడుగుల విస్తీర్ణంలో ఒక ఇంటిని ఎంతో ఇష్టంగా కట్టుకున్నాడు మహమ్మద్ బవ. అయితే ఇద్దరు కుమార్తెల పెళ్లి చేయడంతో కొడుకును ప్రసాద్ ఖాతార్ పంపేందుకు 50 లక్షలు అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే ఇక ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని 40 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడ్డాడు. అతనికి లాటరీలు కొనే అలవాటు ఉంది.  ఈ క్రమంలోనే  అతను కొన్ని లాటరీ జాక్ పాట్ కొట్టింది. కోటి రూపాయలు గెలుచుకున్నాడు దీంతో అన్ని పన్నులు పోగా అతని చేతికి 63 లక్షలు వచ్చాయి. దీంతో చివరికి కష్టాలు తీరిపోయాయి. ఇదంతా విన్నాక ఇతని కంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు అనిపిస్తుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: