హీరో నందు తన టీమ్ తో పాటు యాంకర్ రష్మీ గౌతమ్ ని నిలదీశారు అంట మరీ . రేష్మీ ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రష్మీ గౌతమ్ చేసిన పనికి హీరో నందు నేరుగా స్టూడియోకి వెళ్లి రేష్మీ ని కడిగిపారేశారు.

ఇంతకీ నందుకు యాంకర్ రష్మీ చేసిన అన్యాయం ఏమిటో చూద్దాం.. నందు-రష్మీ కాంబినేషన్లో 'బొమ్మ బ్లాక్ బస్టర్' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్ కూడా విడుదలయ్యాయి. ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతున్నది ఈ సినిమా

మేకర్స్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా గురించి జనాలు ఇప్పటికే మర్చిపోగా… ప్రమోషన్స్ గట్టిగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిందిగా హీరోయిన్ రష్మీని కోరారు అంటా నందు . బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనడం ఇష్టం లేని రష్మీ గౌతమ్ ముఖం చాటేశారు. హీరోతో పాటు యూనిట్ సభ్యులు ఎవరు ఫోన్ చేసినా ఆమె ఎత్తడం లేదు. ఎంతకూ రష్మీ స్పందించకపోవడంతో నందు బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ తో నేరుగా ఆమె షూట్ చేస్తున్న స్టూడియోకి వెళ్లారు.

అక్కడికెళ్లి రష్మీని నిలదీయడం జరిగింది. ఫోన్లు ఎత్తకుండా, ప్రమోషన్స్ కి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన అడిగాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం కుదరదని రష్మీ కుండబద్దలు కొట్టారు. నాకు షూట్స్ ఉన్నాయి, ఒత్తిడి ఉంది అంటూ కుండబద్దలు కొట్టింది. రెండేళ్ల తర్వాత వచ్చి మూవీ ప్రమోషన్స్ అంటే ఎలా అంటూ ఆమె కూడా నిలదీసింది. నందు ఆమెను ఎలాగైనా మన చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనాలని కోరుకున్నారు.


ఈ వ్యవహారం మొత్తం నందు వీడియో తీసి విడుదల చేశారు. అయితే ఈ డ్రామా చిత్రానికి ప్రచారం తేవడం కోసమని మనకు తెలుస్తుంది. ఒక స్క్రిప్ట్ ప్రకారం వివాదం క్రియేట్ చేసి బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలనేది, మేకర్స్ ప్లాన్ అని స్పష్టంగా తెలుస్తుంది అని విరి ప్లాన్ . మరి వీళ్ళ తెలివితేటలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో మనం చూడాలి. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసినట్లు రష్మీ గతంలో చెప్పారు. నవంబర్ 4న బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: