ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో రోజు రోజుకి ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతుండగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీం కోర్టు .. ఈ నెల 24వ తేదీ దాకా అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐను ఆదేశించడం జరిగింది. సోమవారం నాడు మరోసారి ఈ పిటిషన్‌పై విచారణని చేపట్టనుంది. అప్పటి దాకా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగిపోగా ఇక తాజాగా వివేకా రెండో భార్య షేక్ షమీమ్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మొదటిసారి ఆమె సంచలన స్టేట్‌మెంట్‌ను బయటపెట్టారు.ఇక సీబీఐకి షేక్ షమీమ్ మూడు పేజీల స్టేట్‌మెంట్‌ను ఇవ్వడం జరిగింది.2010 వ సంవత్సరంలో తనను వివేకా పెళ్లి చేసుకున్నారని.. 2015 వ సంవత్సరంలో షేహన్ షా (కొడుకు) జన్మించాడని ఆమె వెల్లడించారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీత రెడ్డి బెదిరించారని ఆమె తెలిపారు. అలాగే హత్యకు కొన్ని గంటల ముందు ఫోన్‌లో వివేకా మాట్లాడారని.. బెంగళూరు భూ సెటిల్మెంట్లో మొత్తం రూ.8 కోట్లు వస్తాయని చెప్పారని ఆమె అన్నారు.


ఇక తమ పెళ్లి వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో తమను దూరం పెట్టారని చెప్పారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తానని వివేకా చెప్పేవారని కూడా ఆమె అన్నారు. అలాగే తనను పలుమార్లు వివేకా బామ్మర్ది ఇంకా అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి బెదిరించారని కూడా అన్నారు. చాలా అన్యాయంగా వివేకా చెక్ పవర్‌ను తొలగించారని కూడా అన్నారు.' ఇక నాకు వివేకా గారికి పుట్టిన సంతానమే షేక్ శేహాన్ షా. ఇది నేను ఖచ్చితంగా డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా నిరుపిస్తా. మాకు సంతానం కలగలేదని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న దస్తగిరి అనే ముద్దాయి నిరూపిస్తే నేను మీరు చెప్పినట్లు ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ కనుక నిరూపించలేకపోతే వెంటనే ఈ హత్య చేసిన నీవు ఉరిశిక్షకు సిద్దమా..? వివేకా ఆస్తిపై సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ కూడా కన్నేశారు. పదవిపై ఆయన అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి కూడా ఆశపడ్డారు. వివేకా ఇంటికి వెళ్దామనుకున్నా  కానీ శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు నేను వెళ్లలేదు..' అంటూ షమీమ్ తన స్టేమ్‌మెంట్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: