బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. దీంతో వైసీపీ కేంద్రమంత్రివర్గంలో చేరుతుందా అని కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. ఒకవేళ చేరితే ఇరు పార్టీ లకు పెద్దగా ఒరిగేదేమి లేదని మాత్రం తెలుస్తుంది..కానీ వైసీపీలో కొందరు మాత్రం మంత్రివర్గంలో చేరడమే బెటర్ అని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా మోదీ ప్రభుత్వంలో సాధ్యం కాదని, దాని కోసం పట్టుబడుతూ వెళితే రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదని సూచిస్తున్నారు. కనీసం మంత్రివర్గంలో ఉంటే బడ్జెట్ లో గాని, నిధులు తేవడంలో గాని ఏపికి కొంత ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం వైసీపీ కేంద్రమంత్రివర్గంలో చేరకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎటువైపో చూద్దాం..