ఎన్నికలు ఫలితాలు తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ ఘోరంగా 23 సీట్లు తెచ్చుకోవడంతో నేతలు ఒక్కొక్కరు పార్టీ జంప్ కొట్టేస్తున్నారు. టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండటం కష్టమని భావించి బీజేపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే చాలామంది నేతలు కండువా మార్చేశారు. ఇక మరికొందరు నేతలు కూడా పార్టీ జంప్ చేసేందుకు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఓడిపోయిన నేతలో, మాజీ నేతలో మాత్రమే పార్టీ మారారు. కానీ ఇటీవల ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సిద్ధమయ్యారు.


ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళడం ఖాయమైంది. ఇక తాజాగా విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే గంటానే కాకుండా మరికొందరు కూడా టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా గంటతో భేటీ అయి వచ్చాక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


టీడీపీలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేస్తారని అన్నారు. ఇక సోము వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. 22 మంది ఎమ్మెల్యేలు అంటే చంద్రబాబు మినహా మిగతా అందరూ. అంటే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా బీజేపీలోకి వెళ్లిపోతున్నట్లే.  ఆఖరిలో చంద్రబాబు కూడా తమ పార్టీలోకి వచ్చేస్తారని వీర్రాజు కామెంట్ చేశారు.


అసలు మొత్తానికి మొత్తం టీడీపీనే బీజేపీలో కలిసిపోవడం ఖాయమని కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలన్ని సోషల్ మీడియాలో పెద్ద జోకులుగా మారిపోయాయి. చంద్రబాబు, బాలకృష్ణలు బీజేపీలు చేరడం ఏంటో కామెడీ కాకపోతే అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మొత్తానికి ఎప్పుడు సీరియస్ గా కామెంట్లు చేసే వీర్రాజు కూడా జోకులు వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: