తెల్లవారి లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఎక్కడ చూడు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు అనే వార్తలు గాలికంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. ఒక మనదేశం  లోనే కాదు. ప్రపంచం మొత్తం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇందుకు కారణం మనిషిలోని బలహీనత. దీనికి తగ్గట్టుగానే ఆడవారి వేషాధారణ... నిండా 9 వ తరగతి కూడా పూర్తవ్వని అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్స్‌ను మేయింటెన్ చేస్తున్నారు. ఇక మగవాడి ప్రవర్తన ఎలా ఉందంటే ఇంటికి రా అంటే ఇల్లంతా నాదే అన్నట్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు..

 

 

ఇకపోతే అత్యంత దారుణమైన ఘటన ఒకటి జరిగింది. అదేమంటే అమెరికాలో విస్కాన్సిన్‌లోని కెనోషాలో నివసిస్తున్న క్రెస్టుల్ కిజెర్ (19) అనే యువతి ర్యాండీ వోలార్ అనే వ్యక్తిని తుపాకీతో షూట్ చేసి, నిప్పు పెట్టి చంపినందుకు ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇలా ఎందుకు చేసిందంటే ఆ అమ్మాయిని ఈ మృగాడు అత్యాచారం చేయడమే కాకుండా ఇతరులతోనూ వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నాడని ఈ హత్య చేసిందట..

 

 

‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం 2016లో కిజర్‌ 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఓ వెబ్‌సైట్ ద్వారా ర్యాండీ వోలర్‌కు పరిచయమైంది. ఆ తర్వాత అతడు ఆమెకు మాయమాటలు చెప్పి వ్యభిచారం చేయించేవాడు. రెండేళ్ల తర్వాత ఆమె ఆ వృత్తికి దూరమైంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవించడం మొదలుపెట్టింది. అయితే, వోబర్ మాత్రం ఆమెను పదే పదే వేధించేవాడు. దీంతో విసుగెత్తిపోయిన కిజర్.. ఈ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌ కు చెప్పగా అతను ఆమెకు ఆమెకు పిస్తోల్ ఇచ్చి, అతని వల్ల నీకు ప్రమాదం అనిపించినప్పుడు ఆత్మ రక్షణ కోసం పిస్తోల్‌ను ఉపయోగించమని చెప్పాడు.

 

 

ఇక అనుకున్నట్లే ఓ రోజు వోబర్ ఆమెను ఇంటికి పిలిచి, ఆమెను మాటల్లో పెట్టి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడట. దీంతో ఆమె తన ప్రియుడు ఇచ్చిన పిస్తోల్‌ను తీసుకుని అతడి కాల్చేసి, అనంతరం  నిప్పు పెట్టి.. పరారైంది. అయితే, డ్రగ్స్ మత్తులో ఉండటం వల్ల తనకు హత్య చేసినట్లే గుర్తులేదని కిజర్ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె ఇంకా జైల్లోనే ఉండగా. త్వరలోనే ఈ ఘటనపై కోర్టు తీర్పు వెల్లడించనుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: