ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వైఖరిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే.. బాధ్యయుత ప్రతిపక్ష నాయకుడు మాత్రం హైదరాబాద్‌లో విలాసాల్లో మునిగితేలుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని.. ఇలాంటి సమయంలో ఎటువంటి సాయం అందించని వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబేనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి విమర్శించారు.

 

 

ఇలాంటి కరోనా సమయంలో కూడా చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి దుయ్యబట్టారు. కరోనా విపత్తులో దేశవ్యాప్తంగా దిగువ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు తమ వంతు సాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

 

 

అంతేకాదు.. కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని అడిగే నైతికత టీడీపీకి లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై చంద్రబాబు 2 లక్షల 50 వేల కోట్లు అప్పుల కుంపటి పెట్టారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో మృతి చెందాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.

 

 

ఈ ఎమ్మెల్యేనే కాదు.. మిగిలిన వైసీపీ నేతలు కూడా చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం గతంలో కోట్లాది రూపాయలను ఖర్చు చేశాడని, ఆయన పబ్లిసిటీ పిచ్చి 23 సీట్లకే పరిమితం చేసిందని వారు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని మండిపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: