తల్లిదండ్రులు అతన్ని మంచి చదువులు చదివించారు... చదువు పూర్తి చేశాక ఎంతో మంచి ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రులకు చేయూతగా నిలవాలి అనుకున్నాడు ఆ యువకుడు... కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం రాలేదు.. ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగం దొరికే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో... దాదాపుగా కొత్త ఉద్యోగులను తీసుకోవడం లేదు కంపెనీలు. ఈ నేపథ్యంలో యువకుడికి ఎన్ని కంపెనీలు తిరిగిన ఉద్యోగం రాలేదు. రోజురోజుకు ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరికి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.



 ఈ విషాదకర ఘటన విశాఖపట్నం లో వెలుగు లోకి వచ్చింది. గాజువాక పెంటయ్య నగర్ కు  చెందిన కొండపల్లి సుధీర్ కుమార్ బీటెక్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ప్రస్తుతం కరోనా  సంక్షోభం సమయంలో ఎక్కడ ఉద్యోగం దొరకని పరిస్థితి నెలకొంది.. దీంతో మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రుల కు చేయూతగా నిలవాలి అనుకున్న తనకు పూర్తిగా నిరాశ ఎదురు కావడం తో.. తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో గుడ్ బాయ్ ఎవ్రీ వన్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు... మధ్యాహ్నం భోజనం చేసి స్కూటీపై బీచ్ కి  వెళ్ళాడు. కాసేపటికి బీచ్ లో విగతజీవిగా మారిపోయాడు  యువకుడు.


 కమ్యూనిటీ గార్డులు  పోలీసులకు సమాచారం అందించడం తో హుటా హుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిది  ఆత్మహత్య గా తేల్చిన పోలీసులు... మృతుడి  తల్లిదండ్రులను పిలిచి మృతదేహాన్ని అప్పగించారు. అయితే చేతికొచ్చిన కొడుకు చేయూతగా నిలిచి తమకు అండగా మారతాడు అనుకుంటే ఇలా విగతజీవిగా మారిపోయాడు అంటూ ఆ తల్లిదండ్రుల విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: