నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. రోజులు మారుతున్న కొద్దీ మనుషులు మృగాల కంటే అధ్వానంగా తయారవుతున్నారు. చిన్నపాటి గొడవలకు, మనస్పర్థలకు కూడా సొంతవారిని చంపుకునే స్థితి నెలకొంటోంది. దసరా పండుగ రోజు ఇంట్లో కోడి కూర వండలేదని ఏకంగా భార్యనే హతమార్చాడో భర్త. పండుగ పూట ఇంట్లో కోడి కూర ఎందుకు వండలేదని ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా పండుగ పూట తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూలు జిల్ల లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో సన్నయ్య అతని భార్య సీతమ్మతో కలిసి జీవనం సాగిస్తున్నారు. సన్నయ్య దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. అయితే అతను మద్యానికి బానిసైయ్యాడు. అతని సంపాదించిన డబ్బును మొత్తానికి తాగడానికి వాడుకునే వాడు. దీంతో ఇంట్లో భార్య, భర్తలకు ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలో పండుగ నాడు ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కోడికూర వండలేదని కోపంతో ఊగిపోయాడు. దీంతో భార్య సీతమ్మను అర్జెంటుగా కోడి కూర వండాలని బలవంతపెట్టాడు. కానీ ఆమె వండలేదు. దీంతో కోపోధ్రిక్తుడైనా సన్నయ్య సీతమ్మను తీవ్రంగా కొట్టాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆమె చనిపోయింది. సీతమ్మను చంపిన సన్నయ్య ఆమె మృతదేహాన్ని ఇంట్లో దాచి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఒక్కరోజు తర్వాత లోపల ఉన్న శవం నుంచి వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి ఆ తలుపులు తెరవడంతో అసలు విషయం బయట పడింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ మొదలు పెట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: