చైనా భారత్ సరిహద్దుల్లో  తలెత్తిన వివాదం భారత్ కి ఎంతగా కలిసొస్తుందో చైనా కి అంతగా దెబ్బ కొడుతుంది అనే విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకున్న చైనాకు.. ఆదిపత్యం మాట పక్కన పెడితే ఇక ఎన్నో నష్టాలు చవి చూస్తుంది చైనా. ముఖ్యంగా క్రమక్రమంగా ఆర్థికంగా కుదేలవుతోంది. భారత్ చైనాతో ప్రత్యక్షంగా యుద్ధం చేయడం లేదు కానీ ఆర్థికంగా దౌత్య పరంగా మాత్రం చైనా కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా కు సంబంధించిన అన్ని యాప్స్  భారత్లో నిషేధించడం తో పాటు ఎన్నో రకాల దిగుమతులను కూడా నిషేధించింది భారత ప్రభుత్వం.



 పూర్తిగా చైనాని భారత్ నుంచి నిషేధించేందుకు భారత ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. అదే సమయంలో దౌత్య పరంగా కూడా విజయవంతం అవుతూ చైనా శత్రు దేశాలకు మిత్ర దేశంగా మారుతున్న భారత్.. మరో వైపు నుంచి కూడా ఆర్థికంగా దెబ్బ కొడుతుంది. ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బకు ఆర్థికంగా రోజురోజుకు కుదేలవుతోంది చైనా. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం చైనా కు మరో ఆర్థిక దెబ్బ కూడా తగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోజురోజుకి చైనా ఫోన్లకు గిరాకీ పడిపోతుంది. చైనా లో తయారైన ఫోన్ లకు  ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది అన్న విషయం తెలిసిందే.


 కానీ ప్రస్తుతం రోజురోజుకి చైనా ఫోన్ లకి ఉన్న డిమాండ్ కాస్త పడిపోతుందో చైనా ఆర్థికంగా మరింత కుదేలవుతోంది. ఏకంగా చైనాకు సంబంధించినటువంటి ఫోన్ల అమ్మకాలు 15 శాతం వరకు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం పడిపోగా ఈ 15 శాతంలో  అత్యధికంగా ఇండియాలోనే చైనా ఫోన్లు మార్కెట్ తగ్గిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఇలా చైనా ఫోన్లకు 15 శాతం మార్కెట్ తగ్గిపోవడం అనేది కీలకం గా మారిపోయింది. దీంతో చైనాకు ఆర్థికంగా ఎంతగానో దెబ్బ పడింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఇలా ఆర్థికంగా చైనాకు మరిన్ని షాకులు  తగిలే అవకాశం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: