జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గం లో అన్ని డివిజన్లలో కూడా ఆయా పార్టీల అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే తమకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్లలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామూ  అంటు ప్రస్తుతం హామీల వర్షం కురిపిస్తున్నారు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు. ఇక ఆ అభ్యర్థులకు భారీగా ఆయా పార్టీల కార్యకర్తలు నేతలు కూడా మద్దతు ప్రకటిస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.


 అభ్యర్థులందరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రస్తుతం తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారూ. ఇటీవల మల్కాజిగిరి నియోజకవర్గం లోని.. అల్వాల్ డివిజన్ పరిధిలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి  ముమ్మర ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అక్రమాలు చేసే అధికార పార్టీ మాటలు విని ఓటర్లు మోసపోవద్దు అంటూ ఈ సందర్భంగా అల్వాల్ డివిజన్ బిజెపి అభ్యర్థి కంది కంటి వీణ గౌడ్ ప్రజలకు సూచించారు. అల్వాల్ డివిజన్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయ్ అని అభివృద్ధి జరగాలంటే ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.


 మీ ఇంటి ఆడ బిడ్డ లాగ మీ అందరి క్షేమం కోసం అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నానని మీ అందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలి అంటూ అల్వాల్ డివిజన్ బిజెపి అభ్యర్థి కంది కంటి వీణ గౌడ్ కోరారు. అల్వాల్ డివిజన్ అల్వాల్ సర్కిల్ పరిధిలో పలు కాలనీలలో పాదయాత్ర నిర్వహించిన బీజేపీ అభ్యర్థి వీణా గౌడ్... ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే డివిజన్ అభివృద్ధి కోసం మీ ఇంటి ఆడబిడ్డ గా ముందుకు వచ్చానని ఓటర్లు తమ ఓటు వేసి ఆశీర్వదించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు అల్వాల్ డివిజన్ బిజెపి అభ్యర్థి కంది కంటి వీణా  గౌడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: