దేశంలో రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అభం శుభం తెలియని ఆడపిల్లలని టార్గెట్ చేసుకుంటూ ఎంతో మంది కామాంధులు రెచ్చిపోయి మరీ దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. కామంతో ఊగిపోయి  దారుణంగా అత్యాచారానికి పాల్పడుతూ హత్యలకు సైతం పాల్పడుతున్నారు దీంతో నేటి సమాజంలో ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోయింది అని చెప్పాలి. అడుగడుగున రెచ్చిపోతున్న కామందులు ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.



 అయితే ఈ మధ్య కాలంలో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు కేవలం ఆడపిల్లలపై మాత్రమే అత్యాచారాలు చేసిన కామాంధులు ఈ మధ్య కాలంలో ఏకంగా మగవారిపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.  ఇటీవలే ఓ యువకుడిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెర మీదికి వచ్చి అందరిని ఉలిక్కిపడేలా చేసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  13 ఏళ్ల బాలుడి పై ఆరుగురు  లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.



 వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన 13 ఏళ్ల బాలుడు డాన్స్ షోలు  చేసేందుకు ఒక బృందం లో చేరాడు. ఈ క్రమంలోనే ఆ బృందంలో ఉన్న మిగతా సభ్యులు అందరూ కూడా ఆ బాలుడి పై కన్నెశారు. ఈ క్రమంలోనే అవయవ మార్పిడి కూడా చేశారు ఇక హార్మోన్లు మారే  విధంగా బలవంతంగా అతడితో మందులు కూడా వాడేలా చేసారు. ఇక చివరికి హార్మోన్లు మారిన తర్వాత అతనిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న బాలుడు..  డాన్స్ బృందం చేసిన అరాచకాలు బయటపెట్టాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: