పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి గిరిజా శంకర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. ఒక్కో జిల్లా బాధ్యత ఒక్కో అధికారికి అప్పగించి వెబ్ కాస్టింగ్ ఇన్ పుట్స్ మానిటరింగ్ చేయిస్తున్నారు. గత మూ డు విడతల కంటే ఈసారి మొదటి రెండు గంటల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అయ్యిందని సమాచారం. ఇకపోతే సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను పెట్టాలని ఎస్ ఈసీ పోలీసు శాఖను ఆదేశించింది. మూడు, నాలుగు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఇక ఇప్పటివరకు జిల్లాల్లో నమోదు పోలింగ్ ను ఒకసారి చూస్తే..
శ్రీకాకుళం 36.84
విజయనగరం 54.7
విశాఖ 48.94
ఈస్ట్ గోదావరి 35.85
వెస్ట్ గోదావరి 34.62
కృష్ణా 36.47
గుంటూరు 41.25
ప్రకాశం 40.05
నెల్లూరు 33.94
చిత్తూరు 43.58
కడప 40.69
కర్నూలు 46.83
అనంతపురం 46.36
శాతం మేర ఓటింగ్ నమోదు అయ్యింది.. మరో గంట పాటు జరిగే ఈ పోలింగ్ లో ఏ పార్టీ జెండా రెపె రెపలాదుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది..సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తామని ఎస్.ఈసీ తెలిపారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి