ఏపి లో పంచాయితీ తుది పోరు ఎన్నికలు ఈరోజు జరుగుతున్న విషయం తెలిసిందే.. మూడు విడతల ఎన్నికలతో పోలిస్తే నాలుగో విడత ఎన్నికలు కాస్త రసాభాసగా జరుగుతున్నాయి. ఆ మూడుంటి ఫలితాలు టీడీపీకి షాక్ ఇవ్వగా, జనసేన కు సంతోషాన్ని ఇచ్చాయి. అధికార పార్టీకి విజయాన్ని అందించాయి. ఈరోజు ఉదయం 6.30 కు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం వచ్చేలోపు స్పీడ్ అందుకుంది. గత మూడు విడతల కంటే పోలింగ్ శాతం భారీగా పెరుగుతోంది. ఉయం 10.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41.55 పోలింగ్ శాతం నమోదయింది. ఇక మొదటి నాలుగు గంటలకే 50 శాతం మార్క్ దాటి విజయనగరం జిల్లా దూసుకు పోతోంది. విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో అత్యల్ప పోలింగ్ నమోదయింది.


పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి గిరిజా శంకర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. ఒక్కో జిల్లా బాధ్యత ఒక్కో అధికారికి అప్పగించి వెబ్ కాస్టింగ్ ఇన్ పుట్స్ మానిటరింగ్ చేయిస్తున్నారు. గత మూ డు విడతల కంటే ఈసారి మొదటి రెండు గంటల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అయ్యిందని సమాచారం. ఇకపోతే సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను పెట్టాలని ఎస్ ఈసీ పోలీసు శాఖను ఆదేశించింది. మూడు, నాలుగు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.


ఇక ఇప్పటివరకు జిల్లాల్లో నమోదు పోలింగ్ ను ఒకసారి చూస్తే..


శ్రీకాకుళం 36.84
విజయనగరం 54.7
విశాఖ 48.94
ఈస్ట్ గోదావరి 35.85
వెస్ట్ గోదావరి 34.62
కృష్ణా 36.47
గుంటూరు 41.25
ప్రకాశం 40.05
నెల్లూరు 33.94
చిత్తూరు 43.58
కడప 40.69
కర్నూలు 46.83
అనంతపురం 46.36

శాతం మేర ఓటింగ్ నమోదు అయ్యింది.. మరో గంట పాటు జరిగే ఈ పోలింగ్ లో ఏ పార్టీ జెండా రెపె రెపలాదుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది..సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తామని ఎస్.ఈసీ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: