ఇలాంటి సంఘటన ఒకటి కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది పొలిటికల్ గా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలో ఒక మంత్రి ఒక మంచినీటి సరస్సును పూడ్చి వేసి తనకు నచ్చిన విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. కానీ దీనికి విరుద్ధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ టీవీ అనుపమ ఎదురు నిలిచారు. మంత్రి చేసేది అవినీతి అని సంబంధిత డిపార్ట్మెంట్ కి ఒక నివేదికను సమర్పించారు. దీనిపై సదరు మంత్రి కోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. కానీ కోర్టులో కూడా మంత్రి చేసిందే తప్పని ఋజువయింది. ఇక చేసేదేమీలేక ఆ తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది.
కొద్ది రోజుల్లోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ప్రతి పక్ష పార్టీలకు ఈ విషయం బాగా ఉపయోగపడనుంది. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. ఇంతే ధైర్యంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసర్ ఉండడం ఈ సమాజానికి ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఈమె పేరు దేశంలోనే మారుమ్రోగిపోతోంది.