ఇప్పటికే పలు పిటిషన్లు విచారించిన న్యాయస్థానం కూడా మునిసిపల్ ఎన్నికల్లో జ్యోకం చేసుకోబోమని తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల వైఖరిపై పలు అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ...ఈసారి అటువంటి అనుమానాలకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని..అదేవిధంగా ఐదుకు మించి సభ్యులు ఉండకూడదని నిబంధన పెట్టారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు నిమ్మగడ్డ.
కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రచారాల్లో ఎక్కడా ఈ నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపించలేదు. ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో 50కి పైగా అనుచరులు పాల్గొంటున్నారు. అలాగే నిభందనలు ప్రకారం అన్ని జరగక పోతున్నపటికి...ఇప్పటివరకు ఎవరిపైనా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. ప్రచారాల్లో అటు అధికార పార్టీ ఇటు ప్రత్యర్థి పార్టీలు తమ దూకుడు చూపుతున్నాయి. మరి ఫలితాలు ఎవరికి ఆధిక్యతను తెచ్చిపెట్టనున్నాయో తెలియాల్సి ఉంది. అయితే వాలంటీర్లను నిలువరించడంలో ఎంతమేరకు ఎస్ ఈ సి సక్సెస్ అవుతుందో చూడాలి.