అయితే దగ్గు అనేది ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ నేటి రోజుల్లో మాత్రం దగ్గితే మాత్రం కరోనా వైరస్ అని భావిస్తున్నారు ఈ క్రమంలోనే పదిమందిలో స్వేచ్ఛగా తిరగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది నేటి రోజులు అయితే సాధారణంగా వివిధ రకాల సమస్యల కారణంగా దగ్గడం లాంటివి చేస్తూ ఉంటారు ముఖ్యంగా పొడి దగ్గు అనేది చాలామందిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అంతే కాకుండా గొంతులో కఫం చేరుకోవడం వల్ల కూడా తరచూ దగ్గు రావడం లాంటి సమస్యలు వస్తూ ఉంటారు. అయితే ఈ దగ్గు సమస్యలకు చెక్ పెట్టడానికి ఎంతో మంది వివిధ రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు.
అయితే మెడిసిన్స్ వాడటం కాదు వంటింటి చిట్కాలు పడితే ఇక ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు అని చెబుతున్నారు నిపుణులు ముఖ్యంగా తులసి ఆకులు తింటే దగ్గు మాయం అవుతుంది భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నాకూడా దగ్గు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా దగ్గు నుంచి ఉపశమనం పొందాలి అంటే తేనెలో నల్ల మిరియాలను కలుపుకొని తాగడం వల్ల కూడా ఎంతో ఉపశమనం ఉంటుంది అంటున్నారు. వెల్లుల్లి తిన్నా కూడా దగ్గు కి పులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.