దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు ఎప్పుడు అందించేది తెలియజేసింది. మోదీ సర్కార్ మే 14న రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద మోదీ సర్కార్ రైతులకు అందిస్తున్న డబ్బులను 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. అయితే రైతులకు పీఎం కిసాన్ రూ.2 వేల డబ్బులు అందనున్నాయి. మోదీ సర్కార్ ఇప్పటికే ఈ డబ్బులును రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఇంకా రైతుల డబ్బులు అందలేదు. ఏప్రిల్‌ నెలలో రావాల్సిన డబ్బులు ఇంకా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.

ఇక మే 14 నుంచి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 7వ విడత డబ్బులను రైతులకు ఖాతాల్లో వేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు రైతులకు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులకు రూ.6వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.6వేలు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

అలాగే రైతులు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులు వచ్చాయా? లేదా చెక్‌ చేసుకోవచ్చు. ఇక ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmksan.gov.in/ ను సందర్శించాలి. ఆ తర్వాత మీక ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: