తాజాగా వైసీపీ లాజిక్ లేని పాలిటిక్స్ చేస్తే, దానికి పోలీసులు వత్తాసు పలికారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. తమ నేత పట్టాభి డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రశ్నిస్తూ...నక్కా ఆనందబాబుకు ఆధారాలు ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంపై స్పందిస్తూ..సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫైర్ అయ్యారని, అలాగే బొషడికే అని తిట్టింది కూడా ఆయనే అని, జగన్ని పబ్జీ వీరుడు అని అన్నారని, కానీ అక్కడ జగన్నే తిట్టినట్లు కల్పించుకుని, టిడిపి ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయని చెబుతున్నారు.
అలాగే దాడులు జరిగిన విషయాన్ని ఖండించకుంగా, తిట్టారు కాబట్టే దాడులు చేశారనే విధంగా జగన్తో సహ వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అలా అంటే వైసీపీ నేతలు, చంద్రబాబుని అనేక సార్లు బూతులు తిట్టారని, అప్పుడు తాము కూడా వైసీపీ ఆఫీసులపై దాడులు చేయాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక టిడిపి ఆఫీసులపై దాడికి వైసీపీ శ్రేణులతో పాటు డిజిపి ఆఫీసులోని పోలీసులు మఫ్టీలో ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. అలా వచ్చే ఒక పోలీసు..టిడిపి నేతలకు దొరికారని, కానీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్న టిడిపి నేతలపై అటెంప్ట్ మర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, అలాగే అప్పుడు అక్కడ లేని నారా లోకేష్పై కేసు పెట్టడం బట్టి చూస్తే, వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ఏ విధంగా లాజిక్ లేకుండా చేస్తున్నారో అర్ధమవుతుందని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.