ప్రజలకు సమయానికి క్యాబ్ లను అందిస్తున్న సర్వీసులలో ఉబెర్ కూడా ఒకటి.. ప్రయాణికులకు మరింత చేరువయ్యేలా ప్రణాళికలను సిద్దం చేస్తుంది. ముఖ్యంగా భారత్‌లో కస్టమర్ల ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రత కు పెద్దపీట వేస్తూ ఉబర్‌ ఈ ఫీచర్ల ను తీసుకొచ్చింది. భారత్‌లో ఈ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులో కి వచ్చాయి. ప్రయాణికులు కార్‌లో కూర్చోగానే ముందుగా డ్రైవర్‌ ఫోన్‌ నుంచి 'సీటు బెల్టు పెట్టుకోండి' అని వినిపిస్తుంది. ప్రయాణికుడి ఫోన్‌ కు సైతం పుష్‌ నోటిఫికేషన్‌ వస్తుంది.


దీంతో పాటు మీరు ప్రయాణిస్తున్న కారు లైవ్‌ లొకేషన్‌ను స్థానిక పోలీసులతో షేర్‌ చేసేందుకు SOS ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. త్వరలోనే ఇతర నగరాల్లో ప్రారంభించేందుకు స్థానిక పోలీసుల తో ఉబర్‌ చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా ప్రయాణికుడి కి అత్యవసరంగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు కస్టమర్‌ కేర్‌తో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సేవలను 24×7 అందుబాటులో ఉండనున్నాయి.


ఇకపోతే.. ఈ సేవల కోసం 88006 88666 నంబర్‌ కు డయల్‌ చేయడం ద్వారా ఈ సేవలు పొందొచ్చు. ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే కేవలం 30 సెకన్ల లోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులో కి వస్తారని కంపెనీ తెలిపింది. ఇక నిర్దేశిత రూట్‌ లో కాకుండా వేరే మార్గంలో వాహనం వెళ్తుంటే రైడ్ చెక్‌ పేరు తో ప్రయాణికుల కు అలర్ట్‌ వెళుతుంది. అంతేకాకుండా నిర్దేశిత సమయానికంటే ఎక్కువ సమయం వాహనం ఆపితే అటు డ్రైవర్‌కు, ఇటు ప్రయాణికుడికి ‘ఎవ్రీథింగ్‌ ఇజ్‌ ఫైన్‌’ అనే మెసేజ్ వారికి వెళుతుంది.. అందుకే దీన్ని ఇప్పుడు ప్రయానికులు వినియోగించుకోవచ్చు.. ఇప్పటికే వెయిటింగ్ చార్జీలు పడుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో ఫీచర్ కూడా రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: