తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఎంతో ఉత్కంఠ మధ్య విడుదులైన ఫలితాలలో ప్రజలు ప్రస్తుతం అధికారంలో ఉన్న బిఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు నిలిచారు. ఏకంగా రేవంత్ రెడ్డి రాకతో మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు పోరాటం మొదలు పెట్టిన కాంగ్రెస్ అతి తక్కువ సమయంలోనే ఏకంగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ నూ గద్దె దించి.. ఇక కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఏకంగా ఎన్నికల ఫలితాలలో వారు వన్ సైడ్ అన్నట్లుగానే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలలో విజయం సాధించింది అని చెప్పాలి. ఏకంగా 64 స్థానాలలో విజయంసాధించిన కాంగ్రెస్ మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.



 ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ అధికారంలోకి వస్తే చేయబోయే ఆరు హామీలను ప్రకటించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల తెలంగాణ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో  ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డిలో ఆందోల్ నియోజకవర్గం సెంటిమెంట్ ఆధారంగానే ప్రస్తుతం ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయని.. గత సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయిందంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు.


 ఇంతకీ గత సెంటిమెంట్ ఏంటో తెలుసా.. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం లో ఏ పార్టీ నుంచి అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో ఇక అదే పార్టీ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ఒక సెంటిమెంట్ ఉంది. అయితే ఇక ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఇది నిజమైంది. ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా బిఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఓడిపోయారు. దీంతో ఆందోల్ లోకి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారాన్ని దక్కించుకుంది. 1984 ఎన్నికల నుంచి కూడా ఇక్కడ ఇదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: