
మోడీ రాష్ట్రంలో రూ.57,962 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. నాగాయలంకలో రూ.1,500 కోట్లతో నిర్మించనున్న మిసైల్ టెస్ట్ రేంజ్, వైజాగ్లో యూనిటీ మాల్ నిర్మాణాలకు శంకుస్థాపన జరుగనుంది. అలాగే, రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు రైల్వే ప్రాజెక్టు, రూ.3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు జరుగుతాయి.
ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా, రక్షణ రంగాలను బలోపేతం చేస్తాయని అంచనా. రూ.3,680 కోట్లతో నిర్మించే నేషనల్ హైవే పనులను మోడీ ప్రారంభిస్తారు. అలాగే, రూ.254 కోట్లతో పూర్తయిన ఖాజీపేట-విజయవాడ మూడవ రైల్వే లైన్, గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా బుగ్గనపల్లి, కెయిఎఫ్ పాణ్యం లైన్లను ఆయన ఆవిష్కరిస్తారు.
డీఆర్డీఓ, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వే రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతం ఇస్తాయి. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కీలకమైనవి..
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు