2024 ఎన్నికల ముందు కూటమి గా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు పోటీ చేయబోతున్నాయని తెలిసి చాలామంది నేతల మధ్య సీట్ల వార్ అయితే కనిపించింది. కొంతమంది సర్దుకపోయినా.. గెలిచిన తర్వాత కూడా కొన్నిచోట్ల నేతల మధ్య యుద్ధమే కొనసాగుతోంది. టిడిపి పార్టీకి చెందిన వారు తమకు విలువ ఇవ్వట్లేదని.. టిడిపి వాళ్లు తమను పట్టించుకోవడం లేదంటూ జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు చూసాము. ఇటీవలే బీజేపీ నేతలు కూడా కూటమిలో కొంతమేరకు ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం అన్ని టిడిపి వాళ్ళే పదవులు పొందుతున్నారంటూ ప్రశ్నించారు.


అయితే ఇప్పుడు తాజాగా మరొక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే.. బిజెపి పార్టీకి సంబంధించి బిజెపి పార్టీ వాళ్లు తమను పట్టించుకోవడం లేదంటూ ఒక జనసేన నాయకుడు ప్రశ్నిస్తున్నారు. టిడిపి పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొవ్వూరు ప్రాంతానికి చెందిన టీవీ రామారావు ఆవేదనను తెలుపుతున్నారు. ఆ తర్వాత టిడిపి టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీలోకి చేరారు. పురందేశ్వరి తన ప్రాంతానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు వేయించుకుంటూ తమని పట్టించుకోలేదంటూ  ఆవేదనను తెలిపారు.


టిడిపి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తనని నిర్లక్ష్యం చేస్తోందని.. తనని నామినేటెడ్ పోస్టుకి అనర్హుడిని చేసిందంటూ టీవీ రామారావు మాట్లాడుతూ తనని బిజెపి అన్యాయం చేసిందంటూ జనసేన తరపున ప్రస్తుతం ఉన్న మాజీ టిడిపి ఎమ్మెల్యే రామారావు ఆందోళనకు దిగడం ర్యాలీగా వెళ్లడం అన్నది ఇప్పుడు ఏపీ అంతట వైరల్ గా మారింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితిని అటు కూటమి అధినేతలు సర్ది చెబుతారా లేకపోతే సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారని విషయం చూడాలి మరి. అయితే ఇప్పటికే చాలామంది నేతలు మధ్య కూడా సఖ్యత కనిపించడం లేదని కొన్ని సందర్భాలలో బయటపడుతూనే ఉంది.అయినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు వీరందరిని హెచ్చరిస్తూ ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: