ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటమిపాలు కావడానికి కార్యకర్తలు, అభిమానుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎవరు ఐతే జనసేన పార్టీ సర్వం అని ఫీల్ అయ్యి పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళ పరిస్థితి మరింత దిగజారిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సోషల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతూ ఉండటం గమనార్హం.  ఒక వ్యక్తిని  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన కోరడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  టీడీపీని విమర్శించిన  వాళ్ళ విషయంలో జనసేన ఒకింత కఠినంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.  జనసేన నియంతృత్వ ధోరణి  పార్టీకి  ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం చేకూర్చుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జనసేన సోషల్ మీడియా  జనాలు  కూడా  పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయం కూడా  ఫైర్ అవుతున్నారు.  జనసేన ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.  జనసైనికులు కూటమి పాలనను విమర్శించకూడదని  నెటిజన్లు సైతం ఫీలవుతున్నారు.  హిందీ  గురించి పవన్ చేసిన కామెంట్ల విషయంలో సైతం  భిన్నాభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.

కేంద్రంలో బీజేపీతో బంధం మరింత  బలపడాలనే ఉద్దేశంతో  జనసేన అధినేత పవన్  ఈ విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని కామెంట్లు  వినిపిస్తున్నాయి.  పవన్  సోషల్ మీడియాలో టార్గెట్  కావడం  ఆయన వీరాభిమానులు బాధ పెడుతోంది.  పవన్, జూనియర్  ఎన్టీఆర్ అభిమానులు  సైతం సోషల్ మీడియా వేదికగా  ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ఉండటం గమనార్హం


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: