ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్ల విషయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని ఆయన తెలిపారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీ.ఆర్.ఎస్ ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. కనీసం గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ లను కూడా ఆ పార్టీ పూర్తీ చేయలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో  పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.  ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  కృష్ణా  నదిపై బీ.ఆర్.ఎస్ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎందుకు కట్టలేదని ఆయన తెలిపారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఎందుకు పూర్తి  చేయలేదని ఆయన వెల్లడించారు.  ఈ ప్రాజెక్ట్ ను  పూర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

తెలంగాణ నిర్మించే ప్రాజెక్ట్స్ నిర్మాణాలు పూర్తైన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చని  ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు చేయకూడదని  ఆయన అన్నారు. 2 లక్షల ఎకరాలు మునిగిపోకుండా పోలవరం కట్టుకోవచ్చని ఆయన వెల్లడించారు. ముంపు గ్రామాల ప్రజల తరపున పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

భట్టి విక్రమార్క వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. భట్టి విక్రమార్క చేసిన కామెంట్ల గురించి ఏపీ నేతలు, బీ.ఆర్.ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. భట్టి విక్రమార్క రాజకీయాల్లో మరిన్ని సంచలన విజయాలను సాధించే దిశగా ఉన్నత పదవులు పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: