గెలిచిన తర్వాత పని చేయకపోయినా ఎవ్వరూ అడగరు … పైగా గతంలో ఐదు సార్లు గెలిచిన నేత చేసిన తప్పుల్ని చూపించి తప్పించుకోవచ్చును. కానీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాత్రం అలా కాదు ! మొదటిసారి ఎమ్మెల్యే గా విజయం సాధించినప్పటికీ , బాధ్యతగా నియోజకవర్గాన్ని అభివృద్ధిపథం లో నడిపిస్తున్న రాము పనితీరు ఇప్పుడు మాస్‌ లెవల్లో చర్చనీయాంశం అయింది . ఇతరుల తప్పులు చూపిస్తూ రాజకీయ విమర్శలతో టైం వేస్ట్ చేయకుండా … సొంత పనులతోనే ప్రత్యుత్తరం ఇస్తున్నారు రాము . నియోజకవర్గంలో ఇప్పటివరకు చూడని అభివృద్ధి పనులను దూసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకోవడం లోను ముందున్నరు రాము.


గతంలో రెండు సార్లు, ఇటీవల మళ్లీ విజయవాడకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీను కలిసి గుడివాడ అభివృద్ధికి నిధులు కోరిన రాము .. వేల కోట్లు వ్యయంతో కూడిన రెండు కీలక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చారు. గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల ఎండ్ టూ ఎండ్ అభివృద్ధి అలాగే గుడివాడ – కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం , ఈ రెండు ప్రాజెక్టులు గత పది ఏళ్లుగా ఫైళ్లలో మగ్గుతున్నవే! వాటిని అమలు దశలోకి తీసుకురావడమే రాము విజయాన్ని చాటుతోంది ... త్వరలో ప్రారంభం అవుతున్న అభివృద్ధి పధకాలు .. కేంద్ర నిధులతో మురుగునీటి నిర్వహణకు, రహదారుల అభివృద్ధికి పనులు మొదలవ్వబోతున్నాయి .

 

అదేవిధంగా రూ .8 కోట్లు విలువైన నగరంలోని రహదారులు, డ్రైనేజీలు అప్‌గ్రేడ్ చేసే పనులు కూడా మొదలు కాబోతున్నాయి ..  “ఇంత స్పీడ్‌తో పనులు మొదలెట్టిన ఎమ్మెల్యేను మేం చూడలేదు. పైగా కేంద్రం నుంచి నిధులు తెచ్చిన తీరు చూస్తే రాబోయే రోజుల్లో గుడివాడ చక్కబడిపోతుంది!” అని స్థానికులు గర్వంగా చెబుతున్నారు. ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టడం కాదు … నిజంగా గ్రౌండ్ మీద ఉండే నేతగా రాము పేరు తెచ్చుకుంటున్నారు. వినియోగదారులకు కనిపించే అభివృద్ధే ఆయన స్టైల్. దీంతో పౌరుల మనసులు గెలుచుకుంటూ, తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన బేస్ వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: