హైదరాబాద్ జనాభా ప్రస్తుతం కోటీ 20 లక్షలకు అటూఇటుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా నిన్న మధ్యాహ్నం, రాత్రి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా మేఘాలు గర్జించడంతో అమీర్ పేట చుట్టుపక్కల ఏరియాలలో ద్విచక్ర వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని తెలుస్తోంది. బస్తీలలో ఉన్న 200 ఇళ్లలో నీరు చేరినట్టు సమాచారం అందుతోంది.

జీ.హెచ్.ఎం.సి, హైడ్రా మోటార్లను ఉపయోగించి నీటిని దారి మళ్లించాయి.  భారీ వర్షం వల్ల గురువారం రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు కిటకిటలాడాయని తెలుస్తోంది. నిన్న ఏకంగా 5 లక్షల కంటే ఎక్కువమంది మెట్రోలో ప్రయాణించారని సమాచారం అందుతోంది.  రాబోయే మూడు రోజులు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని జలమండలి ఎండీ  సూచనలు చేశారు.

ఇప్పటికే మంజూరు చేసిన సెలవులను సైతం రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునే దిశగా అధికారుల అడుగులు పడుతున్నాయి.  వరద సహాయం అవసరమైన పక్షంలో కాంటాక్ట్ కావడానికి కొన్ని నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. ఆ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా వరద సహాయం పొందవచ్చు.

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలను ఒకింత భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. భవిష్యత్తులో రోడ్లపై నీళ్లు నిలవకుండా  తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: