
గెలిచి ఎమ్మెల్యేగా నిలిచినా అక్కడితో ఆయన జర్నీ ఆగిపోయింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అసంతృప్తిని బహిర్గతం చేశాయనే టాక్ వినిపిస్తోంది. అమరావతి రైతుల సమస్యలపై తనదైన శైలిలో మాట్లాడిన సుజనా, రుషికొండ భవనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. వైసీపీ పాలనగానే ఇప్పుడు కూటమి పాలన కనిపిస్తోంది అని చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందే కలిగిందని అంటున్నారు. అసలైన అసహనం మాత్రం పదవుల పంచాయతీ మీదేనని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు మంత్రిత్వం దక్కే పరిస్థితి లేదు. సామాజిక సమీకరణల కారణంగా ఆయనను కేబినెట్లోకి తీసుకోవడం కష్టం. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం కూడా ఆయన పేరే వినిపించిందని, చివరికి అది మాధవ్కు దక్కిపోవడంతో ఆయన నిరాశ చెందారన్న టాక్ ఉంది.
దీంతో ఆయనకు ఇప్పుడు ఉన్నది కేవలం ఎమ్మెల్యే పదవి మాత్రమే. ఇది ఆయన స్థాయికి సరిపోదని అనుచరులు గుసగుసలాడుతున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో తనలోని అసహనాన్ని వ్యాఖ్యల రూపంలో బయటపెట్టారని అంటున్నారు. ఈ టెర్మ్ ఇంతేనన్న భావనతోనే సుజనా రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు అని పలువురు అంటున్నారు. ఏదేమైనా.. సుజనా చౌదరి భవిష్యత్లో ఏ దిశగా అడుగులు వేస్తారో చూడాలి. ఈసారి మంత్రివర్గంలో అవకాశం దక్కకపోయినా, రాబోయే కాలంలో ఆయనకు పెద్ద స్థానం లభిస్తుందా లేదా అన్నది తెలుగుదేశం–బీజేపీ కూటమి రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. “ఎమ్మెల్యేగా గెలిచినా, పదవులు దక్కకపోవడం సుజనా అసహనానికి కారణమా?” – ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన చర్చ!