మంచి మనసు ఉంటే జీవితంలో ఎప్పటికీ మంచే జరుగుతుందని మన పెద్దలు తరచూ చెబుతుంటారు. ఆ మాటకి నిజమైన ఉదాహరణగా మారిపోయిన వ్యక్తి పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితం లోనూ ఎప్పుడూ స్వార్థం లేకుండా, సమాజ ప్రయోజనాల కోసం కృషి చేస్తూ వస్తున్నారు. వ్యక్తిగత స్వార్థం లేని ఆయనకు సామాజిక స్వార్థమే పరమావధిగా మారింది. ఆ కారణంగానే ఆయనకు అసాధారణమైన క్రేజ్, అపారమైన పాపులారిటీ లభించాయి. ప్రజలు ఆయనపై చూపిస్తున్న అభిమానానికి, విశ్వాసానికి అంచనా వేయలేం.

ఇటీవల ఆయన నటించిన “ఓజీ – ఒజాస్ గంభీర” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, పరిశ్రమ మొత్తాన్నీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్ తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా రేంజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, భావోద్వేగ సన్నివేశాలు—అల్ల్ తొగెథెర్—ఫ్యాన్స్‌కి పండగలా అనిపించాయి. ఫ్యాన్స్ ఒక్కసారి కాదు, వంద సార్లు చూసినా తమ ఆనందానికి తీరని సంతృప్తి కలిగేలా ఈ సినిమా నిలిచిపోయింది.

అయితే సాధారణ ప్రేక్షకుల విషయానికి వస్తే, సినిమా చాలా బాగుందనే మాట  వినిపించినా, టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఒక్కసారి మాత్రమే చూసి ఆపేశారు. కానీ తాజాగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కారణంగా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీయబోతున్నారు. రిపీటెడ్ ఆడియన్స్ కూడా సులభంగా సినిమాను మరికొన్ని సార్లు చూడగలిగే అవకాశం ఉంటుంది. దాంతో సినిమా కలెక్షన్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

అంతే కాదు, మొదట్లో తొలగించిన నేహా శెట్టి స్పెషల్ సాంగ్ ని  తాజాగా మళ్లీ యాడ్ చేశారు. ఈ సాంగ్ కోసమే అయినా థియేటర్లకు ప్రేక్షకులు తిరిగి వస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్‌కి ఇది ఓ అదనపు బోనామ్హాలా మారింది. ఒక్క సినిమా ఎంజాయ్ చేయడమే కాకుండా, మరింత ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చే ఈ కొత్త అడిషన్ వల్ల కలెక్షన్లు గణనీయంగా పెరుగుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇలా చూస్తే, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందం రెట్టింపు అవుతుంది. ఒకవైపు సినిమా రికార్డులు సృష్టిస్తుండగా, మరోవైపు అభిమానులు తమ ఫేవరెట్ హీరోను మళ్లీ మళ్లీ థియేటర్లో చూసే అవకాశం దక్కుతుంది. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికే “ఓజీ డబుల్ బొనాంజా” అంటూ హడావుడి జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ ఒక్క మాటే వినిపిస్తోంది—“మంచి మనసుంటే మంచే జరుగుతుంది, పవన్ కళ్యాణ్ దానికి బ్రతికున్న ఉదాహరణ!”. ఈ సినిమాలో నేహాశెట్టి సాంగ్ కూడా యాడ్ చేయడం ఇంకా ప్లస్ గా మారబోతుంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: