నిన్నటి రోజున కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి చెప్పాల్సిన పనిలేదు.. హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు బైక్ను ఢీ కొనడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 20 మందికి పైగా మృతి చెందారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ బస్సు ప్రమాదం గురించి కొత్త నిజాలు బయటపడ్డాయి వాటి గురించి చూద్దాం.


కావేరి ట్రావెల్స్  బస్సు ప్రమాదం అనే దానికంటే డ్రైవర్ నిర్లక్ష్యమని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. అందులో మొదటి విషయం ఏమిటంటే ఒకటి మొదటి నుంచి ఈ బస్సు నడిపే డ్రైవర్ అడ్డదిడ్డంగా నడిపేటువంటి అలవాటు ఉన్నది. అలాంటి ర్యాష్ డ్రైవింగ్ తో బైక్ మీద వెళుతున్న యువకుడి బండిని బస్సు ఢీ కొట్టడం  జరిగింది. అక్కడ స్పాట్లోనే బైక్  నడుపుతున్న యువకుడు కూడా మరణించాడు. ఆ బండి బస్సు కిందుకు వెళ్లడంతో బస్సుకు పెద్ద ఎత్తున మంటలు రావడంతో బస్సును అక్కడే వదిలేసి పారిపోయారు డ్రైవర్.

 
వాస్తవంగా డ్రైవర్  బస్సులో ఉండే వారందరినీ కాపాడే అవకాశం ఉన్న భయంతో పారిపోయారు. ఈ బస్సు కి సంబంధించి కొన్ని  విషయాలు బయట పడ్డాయి.. ఈ బస్సు 2018 లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన బండి వాస్తవంగా ఈ బస్సు స్లీపర్ బండి కాదు, కేవలం సిట్టింగ్ బస్సుగా (కూర్చొని వెళ్లే) మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారట. అయితే తెలంగాణలో స్లీపర్ బండిగా మార్చడానికి ఒప్పుకోరు కాబట్టి..  2023లో డయుడామన్ అండమాన్ నికోబార్ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. ఆ పరిమిషన్ తీసుకొని ఈ బస్సుని స్లీపర్ కిందికి మార్చారట.



అయితే అలా స్లీపర్ కింద మార్చే పనేమో ఒరిస్సాలో, పర్మిషనేమో  డయుడామన్ లో, రిజిస్ట్రేషన్ అయింది ఏమో మొదట తెలంగాణలో,అంతేకాకుండా ఈ బస్సుకి ఇప్పటికీ 25 పైగా చలానాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. బస్సులో పాటించాల్సిన ఏ నిబంధనలు కూడా పాటించలేదనే విషయం ఇప్పుడు వినిపిస్తోంది .ఇందులో 43 సీట్లకు(సిట్టింగ్ బస్సుగా )తీసుకున్న పర్మిషన్ ఏకంగా స్లీపర్ కోచ్ బస్సు గా మార్చేశారు. మరి వీటి పైన ప్రభుత్వం విచారణ చేయబడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: