బస్సు ప్రమాదం తర్వాత – శ్యామల వ్యాఖ్యల దుమారం .. కర్నూలులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో 27 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆ జాబితాలో శ్యామల చేసిన వ్యాఖ్యలు కూడా ఉండటంతో ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరైన శ్యామల దాదాపు గంటన్నర పాటు ప్రశ్నల వర్షం ఎదుర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన ఆమె సమాధానాలు చూసి విచారణ అధికారులు కూడా ఆశ్చర్యపోయారట!
"పార్టీ చెప్పింది కాబట్టి మాట్లాడా" – పోలీసుల ముందు ఒప్పుకోలు? .. ప్రమాదానికి ముందు డ్రైవర్ మద్యం సేవించాడని మీరు ఎలా చెప్పారు? ఎవరన్నారు? ఆధారాలు ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నలకు శ్యామల వద్ద సమాధానాలు లేకపోయాయట. అంతేకాకుండా, “నేను వైసీపీ అధికార ప్రతినిధిని. పార్టీ చెప్పిన స్క్రిప్టును చదివాను” అని చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద సెన్సేషన్గా మారాయి. అంటే ఆమె ప్రెస్ మీట్లలో చెప్పిన “నిజం” అంతా పార్టీ డైలాగ్ మాత్రమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది.
విచారణలో ఒక మాట – బయటకు వచ్చి మరో మాట! .. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన శ్యామల, “నేను వైసీపీ అధికార ప్రతినిధిగా పది ప్రశ్నలు అడిగాను. అందులో తప్పేం ఉంది?” అంటూ ధైర్యంగా మాట్లాడటం, లోపల చెప్పిన మాటలకు పూర్తిగా విరుద్ధం. ఈ విరుద్ధ వ్యాఖ్యలతో ఆమె విశ్వసనీయతపై పార్టీ లోపలే చర్చ మొదలైంది. పార్టీ వ్యూహకర్తలు “ప్రసిద్ధి ఉన్న వారిని ముందుకు తేవడం” అనే నిర్ణయం ఇప్పుడు తప్పిదంగా మారిందా అన్న ఆలోచన కూడా మొదలైంది.
వైసీపీ వర్గాల్లో అసంతృప్తి .. శ్యామల పోలీసు విచారణలో చెప్పిన మాటలపై వైసీపీ లోపల అసహనం చెలరేగుతోంది. “కెమేరా ముందు నటించే వాళ్లతో ఇదే ఇబ్బంది” అంటూ కొందరు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి, విచారణలోనే పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడటం నాయకత్వానికి సిగ్గుచేటు అని భావిస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకుల మాటలో — “శ్యామల స్క్రిప్ట్ బయటపడింది. యాక్టింగ్ రియల్గా మారింది!” ఇది ఒక్క వ్యక్తి తప్పిదం కాదు, వైసీపీ ప్రచార వ్యూహానికి ఎదురుదెబ్బ కూడా!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి