ఈ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ ) , వామపక్షాలు , జై భీమ్ పార్టీలు ఉంటాయని ప్రచారం సాగుతోంది.అయితే ఈ పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యం చాలా తక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ఏపీలో సరైన ఉనికి లేకుండా పోయింది. బీఎస్పీ కూడా చాలా పరిమిత స్థాయిలోనే ఉంది. వామపక్షాలు మాత్రం ఒకటి వైసీపీతో దూరంగా, మరొకటి కాస్త రాసుకుని పూసుకుని ఉండేలా ఉన్నాయి. జగన్ ఆలోచన మాత్రం మరో కోణంలో ఉంది. రాష్ట్రంలో ఈ పార్టీల బలం తక్కువగా ఉన్నా.. ఢిల్లీలో లేదా జాతీయ స్థాయిలో వీటి సంబంధాలు, మద్దతు ఆయనకు రాజకీయంగా ఉపయోగపడతాయని ఆయన నమ్మకం.
ప్రత్యేకంగా బీఎస్పీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలు పార్లమెంటు స్థాయిలో ప్రాధాన్యం పెంచుకుంటే, వాటి మద్దతు కేంద్రంలో కీలకం కావొచ్చు. అందుకే జగన్ ఈ తరహా కూటములకు సున్నితంగా స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జగన్ రాజకీయ వ్యూహం ఎప్పటిలాగే ఒకే విధంగా ఉంటుంది. వారితో కలిసి నడిచినా .. వారితో సీట్లు పంచుకోవడంలో ముందడుగు వేయరు. ఈ సారి కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, జగన్ “ఓ కొత్త కూటమి” ఆలోచనలో ఉన్నా, అది ఆయన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే ఉండే అవకాశం ఎక్కువ.
            
                            
                                    
                                            
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి