ప్లే ఆఫ్ కు దగ్గరగా ఉన్న అన్ని జట్లు తమ పాయింట్లను మెరుగు పరచుకుని ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో రోజు రోజుకి జట్ల స్థానాలు పైకి కింద్రకు అవుతున్నాయి. ఈరోజు సన్ రైజర్స్ లీగ్ చివరి మ్యాచ్ గుజరాత్ పై గెలవడంతో 17 పాయింట్లతో పట్టికలో రెండవ స్థానంలో ఉంది.


ఇక ప్రస్తుతం కలకత్తా వర్సెస్ ముంబై మ్యాచ్ ఇప్పుడే ముగిసింది. టాస్ గెలిచిన కలకత్తా బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ సౌరబ్ తివారి 52, రోహిత్ శర్మ 27 పరుగులు చేయగా అంబంటి రాయుడు 63 పరుగులతో జట్టుకి మంచి స్కోర్ వచ్చేలా చేశాడు. ఇక గెలుపు లక్ష్యంతో బరిలో దిగిన కలకత్తా ఓపెనర్ నరైన్ డకౌట్ అవగా క్రిస్ లిన్ 26, గంభీర్ 21 పరుగులు చేశారు. ఉతప్పా 2 పరుగులకే అవుట్ అవ్వగ మనీష్ పాండే 33 మ్యాచ్ ను భుజాన వేసుకున్నాడు. ఇక చివర్లో కలకత్తా బ్యాట్స్ మాన్ చేతులెత్తేసరికి ముంబై విజయం సాధించింది. కలకత్తా 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. కేవలం 9 పరుగుల తేడాతో ముంబై కలకత్తాపై పరుగులు సాధించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: