కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ ను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్లో స్థానం దక్కించు కోవడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే 2021 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ కు సంబంధించి మినీ వేలం నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆసక్తికల ఆటగాళ్లందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి అంటూ బీసీసీఐ మార్గదర్శకాలు కూడా జారీ చేయడం గమనార్హం.
అయితే ఐపీఎల్కు అంతకంతకు క్రేజ్ పెరిగిపోతుంది అనడానికి ఇటీవలే రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా నిదర్శనంగా మారింది 2021 ఐపీఎల్ సీజన్ కోసం కేవలం 61 మంది ఆటగాళ్లు మాత్రమే అవసరం కాగా ఏకంగా 1097 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 814 మంది భారతీయ ఆటగాళ్లు కాగా 283 మంది విదేశీ ఆటగాళ్లు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఇటీవలే ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 20 లక్షల మినిమం ప్రైస్ తో అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 18వ తేదీన వేలం జరగనున్నట్లు తెలుస్తోంది.