ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతలా ఎంటర్టైన్మెంట్ అందుతుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ నిర్వహిస్తోంది 2008లో బిసిసిఐ మొదలుపెట్టిన ఐపీఎల్ టోర్నీ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ వస్తుంది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ లు  వీక్షిస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లు ఇక ఏకంగా సహచరులుగా మారిపోయి.. ప్రత్యర్థులు గా మారిన సహచరులతో హోరాహోరీగా తలపడుతూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ ను  ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్లో స్థానం దక్కించు కోవడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే 2021 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది.  ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ కు సంబంధించి మినీ వేలం నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆసక్తికల ఆటగాళ్లందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి అంటూ బీసీసీఐ  మార్గదర్శకాలు కూడా జారీ చేయడం గమనార్హం.



 అయితే ఐపీఎల్కు అంతకంతకు క్రేజ్ పెరిగిపోతుంది అనడానికి ఇటీవలే రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా నిదర్శనంగా మారింది 2021 ఐపీఎల్ సీజన్ కోసం కేవలం 61 మంది ఆటగాళ్లు మాత్రమే అవసరం కాగా ఏకంగా  1097 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 814 మంది భారతీయ ఆటగాళ్లు కాగా  283 మంది విదేశీ ఆటగాళ్లు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఇటీవలే ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 20 లక్షల మినిమం ప్రైస్ తో అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 18వ తేదీన వేలం జరగనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: