అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా భారీ ధర పలికింది. ఈ సారి ఫ్రాంచైజీలు ఆటగాళ్ల వ్యక్తి గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని ఆయా ఆటగాళ్లపై భారీ ధర పలికారు. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. గత సీజన్ లో బెంగుళూరు తరుపున ఆడిన మోరిస్ ఆ జట్టు వదులుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు. కాగా.. రూ.75లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన మోరిస్ను రాజస్థాన్ జట్టు ఏకంగా రూ.16.25కోట్లతో దక్కించుకుంది.
ఇదిలా ఉండగా టీమిండియా క్రికెట్ చరిత్రలోనే సచిన్ టెండూల్కర్ యొక్క ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది..మాస్టర్ బ్లాస్టర్ గా సచిన్ భారత జట్టుకు ఎన్నో అపూర్వ విజయాలు అంధించదనే కాకుండా ఎన్నో చెరిగిపోని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతటి దిగ్గజ ఆటగాడి తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాది ఐపిఎల్ కు ఆరంగేట్రం చేస్తున్నాడు. తొలిసారి వేలంలో పేరు నమోదు చేసుకున్న అతడిని ముంబయి ఇండియన్స్ రూ.20 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. అతడిని సొంతం చేసుకొనేందుకు మరే ఇతర ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు.వేలంలో అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని భావించినా అలాంటిదేమీ జరగలేదు. అయితే ఆఖరి పేరు మాత్రం అతడిదే కావడం గమనార్హం. .