ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇటీవలే వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడి ఓడింది భారత జట్టు. ఇక ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడబోవుతుంది అయితే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్టులో ఓపెనర్ గా ఉన్న శుభమాన్ గిల్ గాయం బారిన పడ్డాడు. ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. అయితే ఇక శుభమాన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ లేదా కేఎల్ రాహుల్ ను ఆడిస్తారు అని అనుకున్నారు అందరు. కానీ జట్టు యాజమాన్యం మాత్రం జట్టులో ఇద్దరు ఓపెనర్లు ఉన్నప్పటికీ పృథ్వీషా కావాలని పట్టుబడుతున్నారట.
ఈ క్రమంలోనే టీమిండియా మేనేజ్మెంట్ బీసీసీఐ సెలక్టర్ల మధ్య బేధాభిప్రాయాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జట్టులో మయాంక్ అగర్వాల్ కె.ఎల్.రాహుల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు ఉన్నప్పటికీ పృథ్వీ షా ఇంకెందుకు అంటూ మేనేజ్మెంట్ను ఇటీవలే ప్రశ్నించారట బిసిసిఐ సెలెక్టర్లు. అయితే ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగా శ్రీలంక టూర్ లో ఉన్నప్పుడు పృథ్వీ షా ను ఇంగ్లాండ్ పంపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బిసిసిఐ సెలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట ఇప్పటికే యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇక ఈ జట్టులో పృథ్వీ షా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే పృథ్వీ షా ను పంపేది లేదని.. టీం లో ఉన్న ఆటగాళ్లతో సర్దుకుపోవాలి అంటు ఇటీవలే బిసిసిఐ సెలెక్టర్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవ ఇప్పట్లో సద్దుమణుగుతుందా లేదా అన్నది చూడాలి మరి.