ఇక నిలకడ లేని కారణంగా టీమిండియాకు సంజు శాంసన్ పూర్తిగా దూరం అయిపోయాడు. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ గాయపడటంతో అనూహ్యంగా చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ మళ్ళీ టీమిండియా లోకి పునరాగమనం చేశాడు. ఇక ఇటీవలే సంజీవ్ సాంసంగ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సంజూ శాంసన్ లో అసమాన ప్రతిభ ఉంది. అతని బ్యాటింగ్ చూసినప్పుడల్లా ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే ఇలా అతనిలో ఉన్న ప్రతిభకు కొదవలేదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. భారత్లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వాటిని మైదానంలో చూపించడం ఎంతో ముఖ్యమైన విషయం. ఇక సంజు శాంసన్ లో అన్ని రకాల షాట్లు ఆడగల సామర్థ్యం దాగివుంది. అతను ఆడే షాట్లు మిగతా బ్యాట్స్మెన్ లకు మాత్రం ఆడటం ఎంతో కష్టమే. అతనిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి అతని సరైన రీతిలో వాడుకుంటాం.. ఇక సంజు శాంసన్ అతనికి ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటాడు అని ఆశిస్తున్నాము.. అతనిపై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు..