టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో కోట్ల మంది అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ బల్లగుద్ది మరీ చెబుతారు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు అటు విదేశాలలో సైతం ఎంతో ప్రేక్షకులు విరాట్ కోహ్లీనీ అమితంగా అభిమానిస్తాను ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పాపులారిటీ అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.  ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లు ఎవరు కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ దృశ్య విరాట్ కోహ్లికి కనీసం దరిదాపుల్లో కూడా లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక రోజు రోజుకు తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ రికార్డును సృష్టిస్తున్నాడని చెప్పాలి.  ఒకవైపు క్రికెట్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా విరాట్ కోహ్లీ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. ఇంకోవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.  ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు పొందిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.



 విరాట్ కోహ్లీ ట్విటర్ అకౌంట్ను 50 మిలియన్ల మంది ఫాలో అవుతూ ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. మరోవైపు ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ కి మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా తన ఆటతీరుతో మాత్రమే కాకుండా తన ఆటిట్యూడ్తో తన ఫిట్నెస్ తో కూడా ఎంతో మంది యువత తన అభిమానులుగా మారిపోయేలా విరాట్ కోహ్లీ ప్రభావితం  చేస్తూ ఉంటాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: