అందరూ అనుకుంటున్నట్లుగానే అతను ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా అందరికంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ రానున్న రోజుల్లో అందరి రికార్డులను చెరిపేస్తాడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రంఒక భారత బ్యాట్స్మెన్ ఒకరు ఏకంగా సూర్య కుమార్ యాదవ్ను దాటేసి నెంబర్వన్ స్థానంలోకి వచ్చేసాడు.
ఆ ఆటగాడు ఎవరో కాదు శ్రేయస్ అయ్యర్. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఏకంగా 113 పరుగులు చేసి అజయమైన సెంచరీ తో జట్టును గెలిపించాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్కు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇక ఇది ఐదవ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు అత్యధికంగా నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి సూర్య కుమార్ యాదవ్ ను వెనక్కి నెట్టిన శ్రేయస్ అయ్యర్ మొదటి స్థానంలోకి వచ్చేసాడు.