భారత జట్టు నేటి నుంచి శ్రీలంకతో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి 20 సిరీస్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ లో తలబడబోతుంది భారత జట్టు. ఇక టి20 సిరీస్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగుతూ ఉండగా వన్డే సిరీస్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు వహించబోతున్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగే జట్టులో సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో లేకుండా పోయారు.


 దీంతో ఇక శ్రీలంకతో తలబడబోయే టి20 జట్టులో పూర్తిగా యువ ఆటగాళ్లే కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటి వరకు టీం ఇండియాలో ఛాన్స్ కోసం ఎదురుచూసిన ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఇక శ్రీలంకతో టి20 సిరీస్ లో ఇక భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు అవకాశం వచ్చింది. ఇక ఇలా భారత జట్టులో మొదటిసారి అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లలో యువ ప్లేయర్ శివ మావి కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఊహించని రీతిలో భారత జట్టులో చోటు దక్కితే ఇక యువ ఆటగాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.


 ఈ క్రమంలోనే భారత జట్టులో చోటు దక్కడం  పై శివం మావి స్పందించాడు. ఇక ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే శ్రీలంకతో టి20 సిరీస్లో తనకు భారత జట్టులో చోటు దక్కడం  నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది అంటూ శివం మావి చెప్పుకొచ్చాడు. నా సెలెక్షన్ గురించి వినగానే ఒక్కక్షణం పాటు ఏమి తోచలేదు. అది ఎంతో అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించడం కష్టం. నాకు అవకాశం వచ్చిందని ఇక ఎంతో భావోద్వేగానికి గురయ్యాను అంటూ శివం మావి తెలిపాడు. ఇక అతను భారత జట్టు తరఫున ఎలాంటి ప్రదర్శనచేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: