ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టి20 వరల్డ్ కప్ పైనే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు చూపు ఉంది అని చెప్పాలి. కాగా ఇక అన్ని మ్యాచ్ లు కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి. ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఊహించలేని విధంగా ఉంది అని చెప్పాలి. ఇలా ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లను చూసేందుకు కొంతమంది సౌత్ ఆఫ్రికా వెళ్తూ ఉంటే... మరికొంతమంది టీవీల ముందు కూర్చుని ఇక మ్యాచ్ ను కన్నార్పకుండా చూసేస్తూ ఉన్నారు అని చెప్పాలీ.


 కాగా సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు టీమిండియా మహిళలు జట్టు మంచి ప్రదర్శనతో సత్తా చాటుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి  అయిన పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని అందుకుంది టీం ఇండియా జట్టు. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ ను కూడా చిత్తు చేసి వరుసగా రెండు విజయాలు సాధించింది. అయితే ఇక ఇటీవలే ఇంగ్లాండ్తో మూడో మ్యాచ్ ఆడింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత జట్టు ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా సెమీఫైనల్ లో అడుగు పెట్టడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

 అప్పటికే వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉన్న టీం ఇండియా జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. కానీ పటిష్టమైన ఇంగ్లాండును మాత్రం ఓడించలేకపోయింది అని చెప్పాలి. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో 11 పరుగులు తేడాతో ఓటమిపాలు అయింది. ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనలో  ఒకానొక సమయంలో టీమిండియా మహిళల జట్టు తడబడింది అని చెప్పాలి. స్మృతి మందాన 52, రిచా ఘోష్  47 పరుగులతో రాణించినప్పటికీ విజయం అందించలేకపోయారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: