ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గత మూడేళ్ల వరకు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని పని అయిపోయిందని ఇక క్రికెట్ నుంచి తప్పించాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేయడం చూశాం. అయితే ఆ తర్వాత కఠిన పరిస్థితులనుంచి బయటపడ్డ విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను మళ్లీ అలరిస్తూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే మూడేళ్లుగా సెంచరీకి దూరంగా ఉన్నది విరాట్ కోహ్లీ అటు వన్డే టీ20 ఫార్మాట్ లో సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. తద్వారా మళ్ళీ తాను ప్రపంచ రికార్డుల వేట ప్రారంభించాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు విరాట్ కోహ్లీ.. అయితే ఇప్పటివరకు టి20 వన్డే ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఇంకా టెస్ట్ ఫార్మాట్లో మాత్రం విరాట్ కోహ్లీ సెంచరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే సుదీర్ఘమైన ఫార్మాట్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు గడిచిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే ఆస్ట్రేలియా తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ లో అటు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో మాత్రం విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. కాగా చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు. దాదాపు 23 టేస్ట్ మ్యాచ్ ల నుంచి ఒక్క శతకం కూడా నమోదు కాలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ గురించి ఐస్ ల్యాండ్ క్రికెట్ పెట్టిన ఒక పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. విరాట్ అభిమానులకు మాత్రం ఈ పోస్ట్ అసలు నచ్చడం లేదు. విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ లో  సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో సెంచరీ సాధించి 23 టెస్టులు అయ్యాయి. 2019లో కోహ్లీ చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఇది చాలా సుదీర్ఘమైన కాలం అంటూ ఐస్లాండ్ క్రికెట్ పెట్టిన పోస్ట్ తో కోహ్లీ అభిమానులు అందరూ కూడా హర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే విమర్శలకు దిగుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: