బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు తమ దేశ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎక్కడ తక్కువ కాదు అని ఆదేశం మాజీ ఆటగాళ్లు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక పిఎల్ఎల్ ముందు ఐపిఎల్ ఎక్కడ పనిచేయదు అంటూ ఇంకా గొప్పలకు పోతూ ఉంటారు అని చెప్పాలి. కానీ పిఎస్ఎల్ లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అన్నదానికి అద్దం పట్టేలా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే.



 పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పిఎస్ఎల్ లో మరోసారి భద్రత లోపం బయటపడింది. ఈ లీగ్ కు కరాచీ, ముల్తాన్, రావల్పిండి,  లాహోర్ ఆతిథ్యం వహిస్తూ ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రావిల్పిండి, లాహోర్లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే లాహోర్ క్యాలెండర్స్, షెఫర్డ్ జల్మీ మ్యాచ్ తో లాహోర్  మైదానంలో మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ సమయంలో భద్రత కోసం లాహోర్లోని గాడ్డాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 8 సెక్యూరిటీ కెమెరాలు చోరీకి గురి కావడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 కేవలం సీసీ కెమెరాలు మాత్రమే కాదు అటు జనరేటర్ బ్యాటరీలు ఫైబర్ కేబుల్ కూడా దొంగలు ఎత్తుకుపోయినట్లు ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. చోరీకి గురైన వస్తువులను దాదాపు కోటి రూపాయలకు పైగానే విలువ ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయట . అయితే ఇలా సీసీ కెమెరాలు చోరీకి గురైన గడ్డఫీ  స్టేడియంలోనే క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే లీగ్ మ్యాచ్ లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే ఫైనల్ మ్యాచ్లో భద్రత లోపం ఇంకెలా ఉంటుందో అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: