రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతలా మారుమోగిపోతు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఇటీవల ఆస్కార్ అవార్డు లభించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక సినీ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నాటు నాటు పాట వైపు చూస్తుంది. ప్రతి ఒక్కరు ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా హాలీవుడ్ స్టార్స్ సైతం నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు.


 దీంతో ఏ సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో చూసినా కూడా నాటు నాటు పాట ట్రెండింగ్ లోనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఆస్కార్ అవార్డు గెలవడానికి ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా నాటు నాటు పాట గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు నాటు నాటు పాట ఫీవర్ అటు క్రికెట్ లోకి కూడా పాకిపోయింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ట్రెండింగ్ లో ఏ పాట ఉంటే ఆ పాటపై ఎంతో మంది క్రికెటర్లు కాలు కదిపి డాన్స్ చేయడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాము. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నాటు నాటు పాటపై కూడా కాలు కదిపారు టీమిండియా క్రికెటర్లు.


 ఇటీవల ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 189 పరుగుల టార్గెట్ తో బలిలోకి దిగిన టీం ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఏకంగా నాటు నాటు పాట స్టెప్స్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన ఫ్యాన్స్ నాటు నాటు పాట ప్లే చేయకుండానే మైండ్లో ఎందుకో గుర్తుకు వచ్చినట్టుంది... అందుకే హుషారుగా స్టెప్పులు వేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: