ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు కూడా అటు అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా మ్యాచ్లు ఆడటంతో కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడి ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లలో ఆడుతున్న సమయంలో కొంతమంది గాయాల బారిన పడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కోల్కతా జట్టుకు కూడా ఇలాంటి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఇప్పటికే కోల్కతా జట్టుకు 2023 ఐపీఎల్ సీజన్లో శుభారంభం లభించలేదు. మొదటి మ్యాచ్ లోనే ఓటమి చవి చూసింది.
అలాంటి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తర్వాత మ్యాచ్లో పుంజుకోవాలి అని అనుకుంటున్న సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ప్రస్తుతం కోల్కతా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న షకీబ్ ఆల్ హసన్ ఇక ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం లేదన్నది తెలుస్తోంది. అతని ప్లేస్ లో మరో విదేశీ ఆటగాడిని తీసుకోవాలని కోల్కతా జట్టు యాజమాన్యం భావిస్తుందట. అయితే అందుకు ఆటో షకీబ్ ఉల్ హసన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈసారి మినీ వేలంలో అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.