
అలాంటిది అప్పటివరకు ఎక్కడ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని యువ క్రికెటర్ ఉంటే ఒత్తిడికి చిత్తవ్వాల్సిందే. కానీ ఇలాంటి సమయంలో రింకు సింగ్ సంచలన ప్రదర్శన చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీసుకొని రింకు సింగ్ కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఐదు బంతులను కూడా రింకు సింగ్ సిక్సర్లుగా మలిచాడు. ఓడిపోయే మ్యాచ్ లో కోల్కతా జట్టుకు విజయం అందించి.. హీరోగా మారిపోయాడు అని చెప్పాలి. కాగా ఈ రింకు సింగ్ ఎవరు అని అందరూ అతని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం మొదలుపెట్టారు.
24 ఏళ్ల రింకు సింగ్ యూపీలోని పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఇక తల్లి ఇంటి బాధ్యతలను చూసుకునేది. రింకుకు సోదరుడు సోదరి కూడా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల 9వ తరగతిలోనే చదువుకు పులి స్టాప్ పెట్టేసాడు. తండ్రికి ఆసరాగా ఉండేందుకు స్వీపర్గా పనిచేసాడు. కొన్నాళ్లపాటు ఆటో డ్రైవర్ గా కూడా పనిచేశాడు. ఎన్ని కష్టాలు ఉన్న క్రికెట్ ను మాత్రం వదలలేదు. ఇక అతని కష్టానికి 2018లో ఫలితం దక్కింది. అతన్ని 80 లక్షలకు కోల్కతా కొనుగోలు చేసింది. 2018 నుంచి 2021 మధ్యలో కోల్కతాకు పెద్దగా రింకు పరుగులు చేయలేదు. అయినప్పటికీ అతని మీద నమ్మకం ఉంచింది. 55 లక్షలకు అతన్ని మరోసారి కొనుగోలు చేసింది. గత ఏడాది రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో 42 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి ఓడిపోయే గెలిపించి హీరోగా మారిపోయాడు అని చెప్పాలి.